Sunday, 13 September 2026 12:13:37 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి..

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

Date : 03 March 2026 02:42 AM Views : 258

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో (స్థానిక సంస్థలు, రెవెన్యూ) అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్ తో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వినతులనుస్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలోఉంటేసత్వరమే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగాలకు సిఫారసు చేసి సమస్య పరిష్కారం చేయుటకు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలలో మండల ప్రత్యేక అధికారులు ప్రతి 15, రోజులు లేదా మాసంలో మూడు దఫాలుగా వారికి కేటాయించిన హాస్టల్లో తనిఖీ చేసి విద్యార్థులతో స్వయంగా మాట్లాడి అందుతున్న మౌలిక వసతులు విద్యా బోధనల గురించి వివరాలు అడిగి తెలుసుకొని తనకు నివేదిక సమర్పించాలని సూచించారు, ప్రతి విద్యా సంస్థలలో పిల్లలకు హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ సానిటేషన్ లపై ఎలాంటి జాప్యం లేకుండా సౌకర్యాలు కల్పించాలని, షెడ్యూలు ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మానసిక ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు వస్తున్న నేపథ్యంలో టైం టేబుల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించి జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని, పరీక్షా కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఉండే విధంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తనిఖీ చేస్తూ అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ దశల్లో ప్రత్యేక చొరవ తీసుకొని లబ్ధిదారులకు తక్షణ సేవలను అందించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ఈ క్రింది విధంగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. గార్ల మండలం బాలాజీ తండ పంచాయతీ కి చెందిన భూక్య శాంతి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినదని సాంకేతిక కారణాలతో బిల్లు మంజూరు కావట్లేదని తన సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. మరిపెడ మండలానికి చెందిన గోలి మృత్యంజయ తన ఇంటికి సమబందించి పన్ను గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా వచ్చిందని సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని అన్నారు. మహబూబాబాద్ మండలం డి.ఎస్.ఆర్ జండాల తండ గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామ పరిధిలో 5 తండాలు ఉన్నాయని అట్టి తండాలకు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మాణం చేయాలని కోరారు. మరిపెడ మండలం తానంచర్ల గ్రామానికి చెందిన పి.సునీత ఇందిరమ్మ ఇండ్ల రెండవ దశ నిర్మాణం బిల్లు మంజూరు చేయవలసిందిగా కోరారు. బయ్యారం మండలం గౌరారం గ్రామానికి చెందిన వెంకటాద్రి తాను దీర్ఘకాలిక వ్యాది పక్షవాతం తో భాదపడుతున్నానని బతుకుదెరువుకు ఆధారం ఏమి లేదని వికలాంగుల పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని అన్నారు,బయ్యారం మండల కేంద్రాన్ని నియోజకవర్గంగా మార్చుటకు సిఫారసు చేయాలని, నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు దరఖాస్తు చేశారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో (107 ) దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి క్రిష్ణవేణి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జెడ్పి సీఈవో పురుషోత్తం, డివిహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, డిపిఓ హరిప్రసాద్, ఎక్సైజ్ ఎస్పి కిరణ్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి మరియన్న, ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు శ్రీనివాసరావు, శ్రీనివాస్,అన్ని విభాగాల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :