ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆన్లైన్ ఆన్లైన్ మోసాలపై విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని షీ టీం పోలీసులు సూచించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ననిర్వహించారు. ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై, యాంటీ డ్రగ్స్ పలు ఉదాహరణలతో విద్యార్థులకు వివరించారు. ఎవరైనా చెడు గా మాట్లాడిన, ప్రవర్తించిన తల్లిదండ్రులకు చెప్పాలని సూచిస్తూ వాటి నుంచి ఎలా బయటపడటం పై అవగాహన కల్పించారు. అనంతరం మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందని , ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో షీ టీమ్ సభ్యులు శ్రావణ్, జ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News