ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ అబద్ధపు ప్రభుత్వ హామీలను, వెజ్ రోజుల అసమర్ధ పాలనను ప్రజలకు తెలియజేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సెప్టెంబర్ 2 నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫల పాలన పై బిఆర్ఎస్ పార్టీ వారం రోజులపాటు నిరసన తెలిపాలని ఆదేశాల మేరకు మంచిర్యాల కార్పొరేషన్ మరియు హాజీపూర్ మండలం ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రభుత్వం ఏర్పడి చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి వెయ్యి రోజులవుతున్న ఆ హామీని గాలికి వదిలేసారని తెలిపారు. వెయ్యి రోజులు పూర్తవుతున్న ఎందుకు హామీలు నెరవేర్చలేదని మనం ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుదాం అని అన్నారు. అదేవిధంగా వారం రోజులు పాటు జరిగే నిరసనలు ఏ విధంగా జరపాలని నాయకులకు మరియు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మరియు హాజీపూర్ మండల ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,టీబీ జెకెఎస్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News