Friday, 11 September 2026 11:16:35 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం... మంత్రి కొండా సురేఖ బర్తరఫ్..

Date : 03 September 2026 08:36 PM Views : 67

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న మంత్రికొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు గురువారం ఎండ్ కార్డ్ పడింది. వివాదాస్పద పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సురేఖను మంత్రి వర్గం నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి పంపిన లేఖ లోక్ భవన్‌కు చేరింది. ఈ ప్రతిపాదనపై గవర్నర్ అధికారిక నిర్ణయం తీసుకోవడమే తరువాయిగా మిగిలింది.రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం రేపింది. అంతే కాకుండా మరో అరుదైన రికార్డు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన మూడో మంత్రిగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి మంత్రిగా కొండా సురేఖనిలవనున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో బర్తరఫ్ అయిన తొలి మహిళా మంత్రిగా కూడా కొండా సురేఖ చరిత్రకెక్కనున్నారు. గతంలో బర్తరఫ్ అయిన మంత్రులు వీరే... తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కేబినెట్ నుంచి మంత్రులను తొలగించడం ఇది మూడోసారి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ ఫస్ట్ టర్మ్ ప్రభుత్వంలో డాక్టర్ తాటికొండ రాజయ్యను 2015 లో నాటి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న రాజయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ రెండో దఫా ప్రభుత్వంలో మే 2021లో ఈటల రాజేందర్‌పై కూడా కేసీఆర్ బర్తరఫ్ చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉండగా ఈటలపై అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలు రావడంతో ఆయనను కూడా కేబినెట్ నుంచి తొలగించారు. అయితే ఇప్పటి వరకు బర్తరఫ్ అయిన ముగ్గురిలో రాజయ్య, ఈటల రాజేందర్ ఇద్దరు వైద్యారోగ్యశాఖ మంత్రులుగా పని చేస్తుండగా చర్యలకు గురికాగా కొండా సురేఖ మాత్రం దేవాదాయ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ వేటుకు గురయ్యారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: