ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం గ్రామపంచాయతీలో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీకాలనీలో నూతనంగా మంజూరైన సిసి రోడ్డు పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి అధికారికంగా శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి గల్లీలో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. శంకుస్థాపన అనంతరం, గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఎమ్మెల్యే సందర్శించారు. నిర్మాణ తీరును పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగంధర్ రెడ్డి, రామ్ లాల్, అభినవరెడ్డి, గ్రామ సర్పంచ్ నీలా సైదులు నాయక్, రంగయ్య, సోమ చంద్రయ్య, సోమ శ్రీను, లింగయ్య, మహమ్మద్ హుస్సేన్, పటాన్, ప్రవీణ్, బాలాజీ, సొందు, రెడ్యా, వార్డ్ మెంబర్ శైలజ, మంగ్తి,పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News