ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలక్షెట్టిపేట మున్సిపాలిటీలోని గంపల పెళ్లికి చెందిన రామ్ దేని మల్లేశం73 సంవత్సరాల వృద్ధుడు పంట కొట్టే పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ సోమవారం కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్ హెచ్ ఓ అన్వర్ తెలిపారు. మృతుడు గత కొంతకాలంగా మోకాళ్ళ నొప్పు లతో అవస్థ పడుతున్నాడు. డాక్టర్లకు చూపించుకుని మందులు వాడిన నొప్పులు తగ్గకపోవడంతో మనస్థాపం చెంది ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పంటకు కొట్టే పురుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. కుటుంబసభ్యులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించగ పరిస్థితి విషమించడంతో అనంతరం వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు సోమవారం మృతి చెందాడు. భార్య రాందేని గురు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Admin
E Nivas News