ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య తెలిపారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తో పాటు పాలకవర్గం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికైన కౌన్సిల్ సభ్యులను కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో గురునానక్ ఫంక్షన్ హాల్లోఘనంగాసన్మానించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పట్టణంలో పేరుకు పోయిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మున్సిపల్ పాలకవర్గం గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా, నిష్పక్ష పాతంగా పాలన కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు చెల్ల నాగభూషణం, వైస్ ఛైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్, పూర్ణచందర్ రావు, పింగళి రమేష్, ఆరిఫ్, బిరుదుల సత్యనారాయణ, గోప సుజాత, చిన్న రమేష్, తోట సువర్ణ, రమేష్, శెనిగరపు చిన్నయ్య, బోడ రాజు, పెండెం పద్మ, రాజు, సూరం చంద్రమౌళి, బొప్పు సుమన్, రాందేని వెంకటేష్, నలిమేల రాజు, బియ్యల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News