Saturday, 13 June 2026 02:26:37 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

మరిపెడ మున్సిపాలిటీలో రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

13వ వార్డు కాంగ్రెస్ బజార్‌లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి

Date : 24 January 2026 09:07 PM Views : 302

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కాంగ్రెస్ బజార్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. మరిపెడ మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క వార్డులో కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రూ.50 కోట్ల నిధులను మరిపెడ మున్సిపాలిటీకి మంజూరు చేసినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు ప్రారంభమవడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అన్ని వార్డుల్లో దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపెడ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్, జిల్లా మైనారిటీ నాయకులు అఫ్జల్, మండల మైనార్టీ నాయకులు అజీజ్, మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, ఎల్లంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గండి వీరభద్రం, దేవరశెట్టి వెంకన్న, కుడితి వెంకట్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సల్మాన్, కొరివి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :