ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కాంగ్రెస్ బజార్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. మరిపెడ మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క వార్డులో కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రూ.50 కోట్ల నిధులను మరిపెడ మున్సిపాలిటీకి మంజూరు చేసినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు ప్రారంభమవడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అన్ని వార్డుల్లో దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపెడ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్, జిల్లా మైనారిటీ నాయకులు అఫ్జల్, మండల మైనార్టీ నాయకులు అజీజ్, మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, ఎల్లంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గండి వీరభద్రం, దేవరశెట్టి వెంకన్న, కుడితి వెంకట్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సల్మాన్, కొరివి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News