Tuesday, 28 July 2026 09:31:21 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

హెల్మెట్ ధరించిన వారికి పుష్పాలు… లేనివారికి హెల్మెట్ పంపిణీ...

ప్రాణ భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి

Date : 24 February 2026 07:25 PM Views : 199

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల చివరి వారం నిర్వహించే “అరైవ్–అలైవ్” రెండవ విడత కార్యక్రమంలో భాగంగా మంగళవారం గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మున్సిపల్ టీ జంక్షన్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ “అరైవ్–అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై,రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని ప్రజలకు, వాహనదారులకు వివరించారు. హెల్మెట్ ధరించి వచ్చిన వాహనదారులకు పుష్పాలు అందించి అభినందించారు. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి హెల్మెట్‌లు పంపిణీ చేసి, భద్రతానిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సీపీ మాట్లాడుతూ పోలీసులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చలాన్ విధిస్తారని తెలిపారు. అయితే చలాన్ వల్ల పోలీసులకు లాభనష్టం ఏమీ ఉండదని, కానీ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగితే గాయాలు గానీ,ప్రాణ నష్టం గానీ కలిగి మీకూ,మీ కుటుంబానికీ తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.ఇంటి నుంచి వాహనంతో బయటకు వచ్చిన ప్రతిసారి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్‌ను సరిగా ధరించి,సేఫ్టీ లాక్ బిగించి వాహనం నడపాలని తెలిపారు. మీ బంధువులు, స్నేహితులు లేదా పరిచయస్తులు ఎవరైనా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తే వారికి కూడా హెల్మెట్ వినియోగం తప్పనిసరిగా చేయాలని తెలియజేయాలని కోరారు. ప్రాణ భద్రత కోసం ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్,మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, వన్‌టౌన్ ఎస్సైరమేష్ రాముని, ట్రాఫిక్ ఎస్సై హరిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :