ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం నగరంపల్లి గ్రామానికి ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ శాలువాతో సోమవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. స్థానిక సింగిల్ విండో కార్యాలయంలో సర్పంచ్ నాతరి లత-శ్రీనివాస్, ఉపసర్పంచ్ పొరెడ్డి ప్రసన్న-తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు నౌండ్ల సదానందం, మల్యాల కిరణ్ కుమార్, తోకల శ్రీనివాస్, ఏట శ్రీనివాస్ లను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఘనంగా సత్కరించి శుభాకాoక్షలు తెలిపారు. తమ విజయానికి కృషి చేసిన ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, గ్రామస్తులకు, నాయకులు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం ప్రభాకర్, బూడిద రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News