Thursday, 30 July 2026 09:00:39 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రభుత్వ భూముల అక్రమాలపై ప్రశ్నిస్తే నోటీసులా..? మీడియాను భయపెట్టే ప్రయత్నం సరికాదు

తెలంగాణ మాల జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చందా శ్రీనివాస్

Date : 08 January 2026 08:34 PM Views : 278

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల అక్రమాలపై ఆధారాలతో వార్తలు ప్రచురించిన జర్నలిస్టు బోయిని నరేందర్ ముదిరాజ్‌కు లీగల్ నోటీసులు పంపడం సరికాదని తెలంగాణ మాల జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు చందా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. గురువారం కురవి మండల కేంద్రంలో తెలంగాణ మాల జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టు నరేందర్ ముదిరాజ్ సంఘానికి తెలిపిన వివరాల ప్రకారం, కురవి మండలంలోని 747 సర్వే నంబర్‌కు చెందిన విలువైన ప్రభుత్వ భూమిని సుమారు మూడేళ్ల క్రితం ఓ రెవెన్యూ శాఖ ఉద్యోగి అక్రమంగా విక్రయానికి గురి చేసిన విషయాన్ని జర్నలిస్టులు పక్కా ఆధారాలతో వెలుగులోకి తెచ్చారని తెలిపారు. ప్రభుత్వ భూముల అక్రమాలపై ప్రశ్నించిన జర్నలిస్టుకు లీగల్ నోటీసులు పంపడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇది స్వేచ్ఛాయుత మీడియాను భయపెట్టే ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. ప్రజల తరఫున ప్రశ్నించే మీడియాను అణచివేయాలని చూస్తే జర్నలిస్టు సంఘాలు మౌనంగా ఉండవని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కులు, భద్రత కోసం తెలంగాణ మాల జర్నలిస్టు యూనియన్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని చందా శ్రీనివాస్ ప్రకటించారు. ఈ సమావేశంలో తెలంగాణ మాల జర్నలిస్టు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమళ్ళ సహాదేవ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు బొడ్డు అశోక్, జిల్లా నాయకులు గండమాల రోషయ్య, జర్నలిస్టు బోయిని నరేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :