ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం నాగారం బస్టాండు నుండి కన్నాల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రహదారి విస్తరణ పనులకు రూ. 2. 50 కోట్లు, కన్నాల నుండి మల్లేపల్లి వరకు నూతన రహదారి నిర్మాణానికి రూ. 1.80 కోట్ల నిధులు మంజూరు చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి కన్నాల సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గట్టయ్య మాట్లాడుతూ కన్నాల గ్రామానికి రెండు కీలకమైన రోడ్లు మంజూరు చేసిన శ్రీధర్ బాబుకు జీవితాంతంరుణపడి ఉంటామన్నారు. అనంతరం మండల శాఖ అధ్యక్షుడు ఐలీ ప్రసాద్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కన్నాల గ్రామానికి ప్రత్యేక శ్రద్ధతో రోడ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పోయిల రాజయ్య, మాజీ సర్పంచ్ బెల్లంకొండ పుల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు వంగల కీర్తన, పరుశవేన అనిల్, తోట శ్రావణ్, రామగిరి సంపత్, కిసాన్ గ్రామ శాఖ అధ్యక్షులు పాపిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముసుగుల రమేష్ రెడ్డి, కావటి సందీప్, ఉడుత పర్వతాలు యాదవ్, చిదురాల సురేందర్ రెడ్డి, బెల్లంకొండ ప్రభాకర్ రెడ్డి, బెల్లంకొండ భూమారెడ్డి, ముసుగుల జగ్గారెడ్డి, కావట్ సతీష్, జంగిలి శ్రీనివాస్, పోయిల కిట్టు, అయిలి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.
Admin
E Nivas News