Tuesday, 28 July 2026 09:32:32 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం...

మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య

Date : 01 March 2026 09:50 PM Views : 204

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో గల 6వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆదివారం వార్డులోని పలు వీధులను సందర్శించి స్థానిక పరిస్థితులను, పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. వార్డు పర్యటనలో భాగంగా 6వ వార్డు కౌన్సిలర్ తోట సువర్ణ రమేష్ వార్డులో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ కాలువలు, సి.సి. రోడ్లు, వీధి దీపాల సమస్యలను చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని విన్నవించారు. విన్నపాలపై సానుకూలంగా స్పందించారు. అనంతరం చైర్‌పర్సన్ దొంత అంజలి నర్సయ్య మాట్లాడుతూ వార్డుల అభివృద్ధికి తమ పాలకవర్గం కట్టుబడి ఉందని, ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి తమ వార్డుకు విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని కౌన్సిలర్ తోట సువర్ణ రమేష్, వార్డు ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ మోతుకూరి రాజేశ్వరి వెంకటస్వామి, వార్డు ప్రముఖులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :