ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : 113 కులాలుగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రవేశ పెట్టడం అభినందనీయమని, బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాల కొరకు తీవ్ర అన్యాయం జరుగుతున్నందున మరో వర్గీకరణ అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ పేర్కొన్నారు. బీసీలలో ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందిన కులాలే ఎక్కువ లబ్ధి పొందుతున్నారని, అట్టడుగున ఉన్న కొన్ని బీసీ కులాలకు ఎలాంటి లబ్ధి చేకూరడం లేదనే చర్చ నడుస్తుందన్నారు. మున్నూరు కాపు, యాదవ, గౌడ, ముదిరాజ్ వంటి సామాజిక వర్గాలు కొంతమేర అభివృద్ధి చెందినప్పటికీ బీసీ రిజర్వేషన్ల పలాలు వారే పొందుతున్నట్లు ఇతర బీసీ కులాలు భావిస్తున్నాయన్నారు. చాకలి, మంగలి, కుమ్మరి, గంగాపుత్ర, మేర, ఆరెకటిక లాంటి కులాలకు రిజర్వేషన్ల లబ్ధి చేకూరడం లేదన్నారు. అందువల్ల బీసీలలో ఉన్న ఏ,బి,సి,డి,ఈ గ్రూపులను తిరిగి వర్గీకరించాలని ఎటువంటి రిజర్వేషన్ల లబ్ధి పొందని వారికి రిజర్వేషన్లు పొందే గ్రూపులలో చేర్చాలని ఆయన కొరారు. జనాభా ఎక్కువగా ఉన్న కొన్ని కులాలకి ఎక్కువ అవకాశాలు దక్కడం వల్ల బీసీ రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ఇంతవరకు కొన్ని కులాలు శాసన సభ మెట్లు కూడా ఎక్కలేదని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను శాస్త్రీయంగా అమలు చేసి అత్యంత వెనుకబడిన కులాల రిజర్వేషన్ల పలాలు అందేటట్టు చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకు తగినట్టుగా ఏ,బి,సి,డి,ఈ తో పాటు మరొక వర్గీకరణ చేసి ఈ,జి గ్రూపులు ప్రవేశపెట్టి అత్యంత వెనుకబడిన కులాలను చేర్చి వారికి కొంత పర్సెంటేజీ ఇచ్చి ఆదుకోవాలని గోటికార్ కిషన్ జీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Admin
E Nivas News