Wednesday, 29 July 2026 06:31:11 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

వరి కొనుగోలు కేంద్రాలలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం...

అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

Date : 09 May 2026 12:23 AM Views : 172

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య తెలిపారు . శుక్రవారం మంచిర్యాలజిల్లాలోని హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలలోని పలు వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. హాజీపూర్ మండలంలో రహదారిపై రైతులు నిర్వహిస్తున్న రాస్తారోకో వద్దకు చేరుకుని, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారంపై హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వెంటనే ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు హాజీపూర్ మండలంలోని పడ్తన్పల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి టార్పాలిన్ల కొరతపై రైతులు చేసిన ఫిర్యాదులను మార్కెటింగ్ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, మిల్లర్లతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కర్ణమామిడి వరి కొనుగోలు కేంద్రాన్ని మండల పంచాయతీ అధికారి, సర్పంచ్, ఇతర అధికారులతో కలిసి సందర్శించి కేంద్రంలో కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పూర్తిగా పాటించాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు.అవసరానికి అనుగుణంగా లారీలను సమకూర్చాలని రవాణా కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల హమాలీలను సమానంగా కేటాయించి, వరి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. హాజీపూర్ మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, లారీల కేటాయింపులో రవాణా కాంట్రాక్టర్‌తో మాట్లాడి వెంటనే 5 లారీలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని మిట్టపల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, వరి సంచుల లోడింగ్ పనులపై నిర్వాహకులతో సమీక్షించి కొనుగోలు, లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వెంకట్రావుపేట వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, నిల్వ సమస్యపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న సుమారు 1 వేయి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల పీఏసీఎస్ గోదాంను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలం తహసీల్దార్ దిలీప్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: