ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేసీఆర్ను సిట్ విచారణ పేరుతోఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ రేపు తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుత ఆందోళనలు చేపట్టనున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించనున్నారు. అలాగే ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు చేపట్టాలనినిర్ణయించారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నారు. ఈ ఆందోళనల్లో మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే, నిరసనలు పూర్తిగా శాంతియుతంగా నిర్వహించాలని, పోలీసులతో ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.
Admin
E Nivas News