ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత విద్యుత్తును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేకోవాలని అబ్బాయిపాలెం గ్రామ సర్పంచ్ బోడ సోములు అన్నారు. అబ్బాయి పాలెం గ్రామంలో గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు ఉపయోగించుకున్న వినియోగదారులకు సబ్సిడీ పత్రాలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల అనుసారం మేరకు, ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కు 82 లక్షల 62 వేల 498 మంది కుటుంబాలు గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తును వినియోగం పొందుతున్నట్లు తెలిపారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,593 కోట్ల సబ్సిడీనీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు. దీనివల్ల ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కరెంటు బిల్లులు కట్టలేకుండా అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు చెల్లించి లబ్ధిదారులకు సబ్సిడీని వర్తింపజేసినట్లు సోములు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎస్.కె షరీఫ్, కారోబార్ అలవాల యాదగిరి, వివో అధ్యక్షురాలు ఎస్ కె చాందిని, ఎలక్ట్రిసిటీ లైన్మెన్ భాస్కర్, తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News