Wednesday, 29 July 2026 01:45:27 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

కేసీఆర్‌కు యాదాద్రి రేవంత్‌కు భద్రాద్రి..

ఇది పరిపాలన అధ్యక్షుల తీరు...

Date : 27 March 2026 09:40 PM Views : 145

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయ అభివృద్ధి విషయంలో పదేళ్లుగా నెలకొన్న స్తబ్దతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. భద్రాద్రి రాముడి ఆలయ పునర్నిర్మాణం తో పాటు పరిసరాల అభివృద్ధి కోసం ఏకంగా రూ. 586 కోట్ల భారీ వ్యయంతో మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించారు. తొలి విడదల నిధులు విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదేళ్ల పాలనలో యాదాద్రిని అద్భుతంగా నిర్మించినప్పటికీ, భద్రాచలం విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు శ్రీరామనవమికి ముత్యాల తలంబ్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ మొదటి రెండేళ్లు పాటించినా ఆ తర్వాత క్రమంగా దూరమయ్యారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయిస్తామని ప్రకటించినా, ఆ నిధులు ఎప్పుడూ ఆలయ అభివృద్ధికి చేరలేదు. భద్రాచలం వెళ్తే పదవి పోతుందనే ముఖ్యమంత్రి సెంటిమెంట్ కారణం వల్ల కేసీఆర్ అటువైపు చూడలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. అలాంటి సెంటిమెంట్లను పట్టించుకోని రేవంత్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే భద్రాచలంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ విస్మరించిన క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అటు హిందూ ఓటు బ్యాంకుతో పాటు ఇటు స్థానిక ప్రజలకు బలమైన సంకేతం పంపాలని ఆయన భావిస్తున్నారు. మూడు దశల్లో చేపట్టబోయే ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా గోదావరి కరకట్ట నిర్మాణం, భక్తుల కోసం అధునాతన వసతులు, ఆలయ ప్రాంగణ విస్తరణ వంటివి ఉన్నాయి. మొత్తం రూ. 586 కోట్ల ప్రాజెక్టులో తొలి దశలో కేటాయించిన రూ. 351 కోట్లతో అత్యవసర పనులను ప్రారంభించనున్నారు. వర్షాకాలంలో భద్రాచలాన్ని ముంచెత్తుతున్న గోదావరి వరదల నుంచి పట్టణాన్ని కాపాడేందుకు రక్షణ గోడల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆలయ మాడ వీధుల నిర్మాణం, అన్నదాన సత్రాలు, పార్కింగ్ వసతుల కల్పన వంటివి రెండో దశలో చేపట్టనున్నారు. భక్తితో పాటు రాజకీయం కూడా అలవాడ చేసుకున్నారు. కేసీఆర్ ఏ క్షేత్రాలను నిర్లక్ష్యం చేశారో, వాటినే లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి తన ప్రాధాన్యతలను మార్చుకుంటున్నారు. యాదాద్రి కంటే భద్రాచలం పురాతనమైనదని, దానికి సరైన గుర్తింపు లేకపోవడం అన్యాయమని రేవంత్ భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి భద్రాచలం రూపురేఖలు మారిస్తే, అది రేవంత్ రెడ్డి సర్కార్‌కు అతిపెద్ద రాజకీయ ఆస్తిగా మారుతుందనడంలో సందేహం లేదు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :