ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం వెంకటరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారి నరేందర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఇటిక్యాల సబ్ సెంటర్లు మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మౌనిక,ఆరోగ్య కార్యకర్త విజయ దర్శినితో ఉపకేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను పరీక్షించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు పిల్లలకు వ్యాక్సినేషన్ వివరములను తెలుసుకొని అదేవిధంగా ప్రతి వ్యాక్సినేషన్ కార్యక్రమమునకు ముందు పిల్లల వివరములను గర్భవతుల వివరాలు దగ్గర ఉంచుకోవాలని ఆశా కార్యకర్తలు ఇంటికి వెళ్లి వారికి తినిపించి వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశించారు. అదే విధంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అన్నివి కూడా 100% పూర్తి చేయాలని రోజువారి వివరములను వాక్సినేషన్ వివరములు నమోదు చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు యూవిన్ పోర్టల్ లో వివరములు నమోదు చేయకుంటే వాక్సినేషన్ వివరములు రిజిస్టర్ కావని కావున నమోదు చేయాలన్నారు. క్షయ వ్యాధి నియంత్రణ లో భాగంగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం పరీక్షలు చేయడము మందులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలందరికీ హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఇప్పించి క్యాన్సర్ నుండి విముక్తి చేయాలని సూచించారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఉపకేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. అదేవిధంగా వెంకట్రావుపేట ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యాధికారి డాక్టర్ సమత మరియు వైద్య సిబ్బంది నర్సింగ్ అధికారులు ఆరోగ్య కార్యకర్తలు సుప్రవేజర్లతో సమీక్ష చేసి ఆరోగ్య కార్యక్రమాలన్నీ నమోదు చేయాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవల పైన సంతృప్తి వ్యక్తం చేసినారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ను మందుల నిల్వలకు గదిని ఓపి ఇన్ పేషంట్ రూములను తనిఖీ చేసి శుభ్రత పాటించాలని సూచించారు. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వనమోత్సవాన్ని పాటిస్తూ చెట్లు నాటారని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, సిహెచ్ఓలు నామదేవ్ హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సేవలు అందిస్తూ ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ మున్సిపల్ ఐసిడిఎస్ విద్యాశాఖ సమన్వయంతో ఆరోగ్య సేవలను అందించాలని ఆదేశించారు.
Admin
E Nivas News