ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సన్రైజ్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసి సంవత్సరం గడిచినందున క్లబ్ సభ్యులు ప్రధమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్కే ఎస్టేట్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాసబత్తిని సతీష్, మక్సుద్, బోడ లక్ష్మణ్ నాయక్, ఉపేందర్, వెంకన్న, యాకయ్య, రవి తదితరులు పాల్గొని దాతలను, క్లబ్ సభ్యులను అభినందించారు. వారు మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ప్రశాంతతకు, ఉల్లాసానికి,శరీర దృఢత్వానికి దోహదపడతాయని నేటి సమాజంలోని యువత చెడు వ్యసనాల బారిన పడకుండా జీవనశైలిని మార్చుకుంటూ ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెర్సీ, ట్రాక్ దాతలు ఆదిత్య జువెలర్స్ మోత్కూరి చంద్రమౌళి, లూబీ పంప్స, ప్రదీప్ రెడ్డి, క్రికెట్ బ్యాట్ దాతలు బోడ లాక్పతి నాయక్, హనుమంత్ యాదవ్, బోడ లక్ష్మణ్, బానోత్ మహేందర్, సన్రైజ్ క్లబ్ సభ్యులకు క్రీడా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా దాతలను శాలువాతో సత్కరించిన సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యులు కెప్టెన్ నరేష్, వైస్ కెప్టెన్ దసరా, బోడ శీను (జ్యోతి రిపోర్టర్), బోడ రవి, రాజా, బాలు, హరీష్, రవి రాణా, అశోక్, కృష్ణ, ఎర్ర రవి, వెంకటేష్, ఇతర సభ్యులు సత్కరించారు.
Admin
E Nivas News