ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జాతీయ బాలికల దినోత్సవన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవధికార సంస్థ బోథ్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల యందు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కే. సందీప్ హాజరై మాట్లాడుతూ బాలికల హక్కులు కాపాడబడాలంటే పాఠశాల స్థాయి నుండే బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని బాలిక విద్య పొక్సో బాల్య వివాహాలు సైబర్ క్రైమ్స్ సమానత్వ హక్కుల గురించి అవగాహన కల్పించారు. మొదటి సారి పాఠశాల కి వచ్చిన జడ్జిని పాఠశాల సిబ్బంది శాలువాతో సన్మానించడం జరిగింది. అనంతరం పాఠశాలలో జరుగుతున్న క్రీడల లో భాగంగా విద్యార్థుల సెటిల్ క్రీడ అటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏజిపి పంద్రం శంకర్, సీనియర్ న్యాయవాది మోహన్ రావ్, కుమ్మరి విజయ్ కుమార్, దమ్మాపాల్ సిఐ గురుస్వామి, ఎస్ఐ పురుషోత్తం ప్రధానోపాధ్యాయులు ఆత్రం శంకర్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News