ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఎవరైనా సరే సామాజిక మాధ్యమాల్లో ఇరువర్గాలను రెచ్చగొట్టే విధంగా, రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తే విధంగా లేదా ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా లేదా ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చర్యలు తప్పవని మంథని ఎస్సై డి రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా ఒక వ్యక్తికి లేదా ఒక వర్గానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లయితే వారి పైన చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాజంలో శాంతి, సహనం పాటిస్తూ ఒకరికొకరు గౌరవిస్తూ ప్రవర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్ ఐ రమేష్ స్పష్టం చేశారు.
Admin
E Nivas News