ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లాలక్షేట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారం రోజులపాటు కొనసాగిన విద్యా వారోత్సవాలు ఆదివారం తోఘనంగా ముగిసాయి. కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ అధ్యక్షతలో జరిగిన కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొని వారోత్సవాల ముగింపు వేడుకలు విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మాట్లాడుతు విద్యావారోత్సవాల్లో గత వారం రోజుల పాటు కళాశాలలో జరిగిన కార్యక్రమాలపై నివేదిక సమర్పించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల చేతులపై ప్రారంభమైన వారోత్సావాల్లో ఉచిత పి.జీ ఎంట్రన్స్ కోచింగ్ , యోగా శిక్షణ,గ్రంథాలయ జ్ఞానోత్సవం , కృత్రిమ మేధపై అవగాహన, ఉపన్యాసం, పూర్వ విద్యార్థుల సమావేశం, కళాశాల నుండి కాకతీయ యూనివర్సిటీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మరియు ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల నుండి ఉత్తమ ఫలితాలు సాధించిన అధ్యాపకులకు సన్మానం తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. మొత్తం ప్రభుత్వం సూచించిన అన్ని కార్యక్రమాలు చేపట్టామని విద్యా వారోత్సవాలు దిగ్విజయం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంస్థ అభివృద్ధికి ఉపయోగ పడుతుందని తెలిపారు. ముగింపు వేడుకల సందర్భముగా కళాశాల కల్చరల్ కో ఆర్డినేటర్ తన్నీరు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్న్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సంతోష్ , వైస్ ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ ఐక్యూఏసి కోఆర్డినేటర్ ప్రేమలత, అధ్యాపకులు శంకరయ్య, తిరుపతి, తన్నీరు సురేష్, లైబ్రేరియన్ నాగేశ్వర్, చంద్రశేఖర్, శ్రీనివాస్ సంధ్యారాణి, కవిత, మల్లయ్య, రాజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్,నాగే0దర్, స్వామి శ్రీనివాస్, నిషాoత్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News