ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ మంగీలాల్ సోమన్ సతీమణి సోమవారం మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎంపీ వంశీకృష్ణ మంగళవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. చంపి వెంట స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
E Nivas News