ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేలాల గట్టు మల్లన్న స్వామిని శనివారం పెద్ద పెళ్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్న ఎంపీ భక్తులతో కలిసి నామస్మరణ చేస్తూ మల్లన్న స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడాయి. అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం వస్తున్న నేపథ్యంలోవేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయం ప్రాంత ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శివరాత్రి జరిగే జాతర కూడా హాజరవుతానని తెలిపారు. ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎంపీ పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. ఎంపీ వెంట మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు ప్రజాప్రతినిధులు నాయకులు, అధికారులు భక్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News