ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ (కాకా) గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు నూకల బానయ్య, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ, బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొండ శంకర్ లు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్లో ఇండ్లు లేని వేలది మందికి గుడిసెలు వేయించి పట్టాలు ఇప్పించారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ప్రైవేట్ రంగంలో తొలిసారి పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారన్నారు. కాకా వెంకటస్వామి వారసులు గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు కాక వారసత్వాన్ని ముందు తీసుకెళుతున్నారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, యువనేత దుద్దిళ్ళ శ్రీను బాబులు ముఖ్య పాత్ర పోషించి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ను భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. పెద్దపెల్లి ఎంపీగా మంథని నియోజక వర్గానికి ఎంపీ నిధులను కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు చేయాలని నాయకులు కోరారు. వెంకటస్వామి ఆనాడు సింగరేణి మరి ఎఫ్సీఐ కంపెనీలు నష్టాలలో కోరుకుపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి దానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి లాభాల బాటలో వేసినటువంటి మహానేత వెంకట స్వామివారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
Admin
E Nivas News