ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ గురుకుల పాఠశాలలో సరైన పర్యవేక్షణ లేక విద్యార్థి తీవ్ర ఇబ్బందులు పడుకున్నారని ఆరోపిస్తూ కేజీబీవీ ప్రత్యేక అధికారి పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో ఎస్ ఓ లది ఆడింది ఆట పాడింది పాటలాగా జిల్లాలో కనబడుతుం దని సరైన మెనూ అందించకపోవడంతో విద్యార్థులు అవస్థలకు గురవుతు ఆస్పత్రి పాలై జ్వరాలతో మరణిస్తున్నారని డివైఎఫ్ఐ, కెవిపిఎస్ సంఘాల ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంగాల నాయకులు మాట్లాడుతూ నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వాంకిడి మండలంలో కేజీబీవీ ఎస్ఓ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థులని మానసికంగా మాటలతో ఇబ్బంది పేడుతున్నారని, ఇన్సూరెన్స్ విద్యార్థులు గత నెలలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారన్నారు. మానసికంగా ఇబ్బంది పడుతున్న ఎస్ ఓ ను తొలగించాలని విద్యార్థులు ధర్నా చేయడం జరిగిందన్నారు. ఎస్ ఓ దురుసుగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యం చేసే ఎస్ ఓ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, కెవిపిఎస్ జిల్లా నాయకులు వడ్లూరీ మల్లేష్ పాల్గొన్నారు.
Admin
E Nivas News