ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన పేదలకు మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడంలో అధికారులు,పాలకవర్గం అవలంబిస్తున్న కాలయాపనపై బిఆర్ఎస్ కౌన్సిలర్లు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉండి, ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ, లబ్ధిదారులకు పత్రాలు అందజేయకుండా కాలయాపన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. పేదల సొంతింటి కల సాకారం కావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం బిఅర్ఎస్ పార్టీ సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ప్రతిష్టాత్మకంగా ఈ ఇళ్లను నిర్మించిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అర్హులైన వారికి న్యాయం జరగకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని, మౌళిక సదుపాయాలు తక్షణమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని బిఅర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిఆర్ఎఫ్ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Admin
E Nivas News