ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భాగ్యనగరం తోపాటు పట్టణాలు పల్లెల్లో తెలంగాణ సంస్కృ తి, సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల సందడి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. చారి త్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన శ్రీ జగదాంబిక మహం కాళి అమ్మవారికి గురువారం నాడు తొలి బోనాన్ని సమ ర్పించడంతో ఈ నెల రోజుల ఉత్సవాలకు అధికారికంగా అంకు రార్పణ జరిగింది.
అమావాస్య తర్వాత వచ్చే గురు, ఆదివా రాల్లో మొదటి బోనా న్ని గోల్కొండ జగ దాంబిక అమ్మ వారికి సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ గా ఉంది. ఇందులో భాగంగానే మొదటి ఆదివారం నాటి బోనాల సమర్ప ణతో గోల్కొండ కోట ప్రాంగణం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభతో మురిసిపోతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తు లతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.మొదటి ఆదివారం గోల్కొండ జగదాం బిక మహంకాళి అమ్మవారి బోనాలతో ఉత్సవాలు ప్రారంభ మై,,రెండో ఆదివా రం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఘనంగా బోనాల నుసమర్పించారు. తదుపరి మంగళ వారం అమ్మవారి కల్యాణ వేడుకలు. మూడో ఆదివారం సికింద్రా బాద్ లష్కర్ సికింద్రాబాద్ ఉజ్జయి ని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. నాల్గో ఆదివారం పాతబస్తీ హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వా జా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి బోనాల పండుగను పురస్కరించుకుని నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయా లన్నింటినీ రంగురం గుల విద్యుత్ దీపాల తో సర్వాంగ సుంద రంగా ముస్తాబు చేశారు.
ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ప్రభుత్వం, ఆలయ కమిటీలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. శాంతి భద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ నియంత్రణకు గాను భారీగా పోలీ సు బందోబస్తును మోహరించారు. అలాగే పల్లెలు పట్టణంలో సైతం ప్రజలంతా పోచమ్మ, మైసమ్మ అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో డబ్బు చప్పుళ్ల మధ్య కోళ్లు, మేకలను బలి ఇస్తూ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.
Admin
E Nivas News