ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 9వ తేదీన నంద్యాలలో జరిగే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపీఎంఎఫ్) జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ నందికొట్కూరు కో- కన్వీనర్ బి.పక్కిరయ్య ఆధ్వర్యంలో జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులు ఎస్.షర్పద్దీన్ అలి, జి.గోవిందు, భావన వినోద్ కుమార్, కే.అంకన్న, కే.మోషే, బి.స్వాములు, షేక్.మహమ్మద్ రఫీ, షేక్.మహబూబ్ బాషా, జి.సాయి కృష్ణ, రాయపాటి మురళీమోహన్, జి.ప్రవీణ్ కుమార్, డక్కా.శ్రీకాంత్, ఎం.వెంకట రమేష్, ఎం.రాము గౌడ్, వై.శివారెడ్డి, ముద్రగడ.శ్రీనివాసరావు, నాగ స్వామి నాయక్, బలరాం, జూపాడుబంగ్లా మధు, తదితరులు పాములు పాడు ప్రెస్ క్లబ్ లో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ నంద్యాలలో జరిగే మహాసభలో మీడియా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకు సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని, గతంలో ఉన్న మాదిరిగా రైల్వే పాసులు మంజూరు చేయాలని, తదితర అన్ని అంశాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందనీ అన్నారు. ఈ మహాసభకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, వివిధ సంస్థల చైర్మన్లు, తదితర ప్రముఖులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపీఎమ్ఎఫ్) వ్యవస్థాపకులు & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ.ఢిల్లీ బాబు రెడ్డి, ఏపీఎంఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.మద్దిలేటి, నంద్యాల జిల్లా ఆహ్వాన కమిటీ కన్వీనర్ పి.నాగవర్ధన్ రెడ్డి, కో కన్వీనర్ లు పి.శివకుమార్ రెడ్డి, సీ.ఎం.శ్రీనివాసులు, మరియు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కమిటీల సభ్యులు హాజరవుతారన్నారు. కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని, ఆహ్వాన కమిటీ కోరింది.
Admin
E Nivas News