ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ ఈగల్ ఆధ్వర్యంలో,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక "నషా ముక్త్ భారత్ అభియాన్"కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ అవేర్నెస్ వర్క్షాప్లో పాల్గొని"సర్టిఫైడ్ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ అవేర్నెస్ ట్రైనర్స్"గా గుర్తింపు పొందిన కానిగంటి లక్ష్మణ్,అగూడ తిరుపతి,రాపల్లి రాజన్న,రాజేశం కుమ్మరి శుంక్రవారం మంచిర్యాల జిల్లా డీసీపీ కార్యాలయంలో జిల్లా డీసీపీ అగ్గిడి భాస్కర్,ఐపిఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా వర్క్షాప్లో పొందిన శిక్షణ,కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల "నషా ముక్త్ భారత్ అభియాన్" లక్ష్యాలు, మంచిర్యాల జిల్లాలో చేపట్టనున్న డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలపై డీసీపీ తో చర్చించారు.డీసీపీ అగ్గిడి భాస్కర్ ట్రైనర్లనుఅభినందిస్తూ, మాదకద్రవ్యాల నిర్మూలనలో సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు,గ్రామాలు,యువజన సంఘాల్లో విస్తృత స్థాయిలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలనిర్వహించి యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఇంపాక్ట్ ట్రైనర్స్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి "డ్రగ్స్ రహిత మంచిర్యాల డ్రగ్స్ రహిత తెలంగాణ నషా ముక్త్ భారత్" లక్ష్య సాధనకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
Admin
E Nivas News