ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని నుంచి కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రికి ఈ నెల 24 నుండి ఉచిత బస్ సేవలు పునః ప్రారంభం కానున్నాయని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సదానందం తెలిపారు. ప్రతి సోమ, శుక్రవారం మంథని, మంగళవారం కమాన్ పూర్, బుధవారం మంథని ముత్తారం, గురువారం మంథని, గుంజపడుగు, శనివారం తాడిచెర్ల గ్రామాల నుంచి ఉదయం 8.30 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. ప్రతిమ హాస్పిటల్ బస్ సేవలను మంథని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రికి వచ్చే వారు రేషన్ కార్డుతో పాటు పాత ఓపీలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9705309496 సంప్రదించాలన్నారు.
Admin
E Nivas News