Friday, 11 September 2026 11:14:05 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య... అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

Date : 03 September 2026 08:46 PM Views : 52

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాశాఖ అధికారి పి.చంద్రయ్య తెలిపారు . గురువారం మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో వచ్చే సంవత్సరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. గ్రామ అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులను ప్రణాళికలో చేర్చాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై గ్రామస్థుల అభిప్రాయాలను స్వీకరించి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో బ్లూ డాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐ.పద్మజతో కలిసి విద్యార్థులకు 30 సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలనుసాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన విద్యా వాతావరణం, నాణ్యమైన బోధన అందుతున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని తెలిపారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడే విధంగా బ్లూ డాన్ స్వచ్ఛంద సంస్థ సైకిళ్లను అందించి సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్, మందమర్రి మున్సిపల్ కమిషనర్ టి.రాజలింగు, మండల విద్యాశాఖ అధికారి రాథోడ్ రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :