ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన పర్శబోయిన సమ్మయ్య పై ఇటీవల అదే గ్రామానికి చెందిన సర్పంచ్ దాడి చేసి గాయపరిచారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు అయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆరెల్లి కిరణ్ గౌడ్, మెండే రాజయ్య, గుంటుకు గణేష్, ఉప సర్పంచ్ ఆకుల ప్రత్యూష సాయి, వార్డు సభ్యుడు ఎలాకుర్తి మహేష్, ఆకుల భాస్కర్ లు సమ్మయ్యను పరామర్శించి దాడికి గల వివరాలు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భయపడ వద్దని, అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు సమ్మయ్య కు భరోసానిచ్చారు.
Admin
E Nivas News