ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమురం భీం ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ వద్ద జాతీయ రహదారి 363పై రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృతి చెందిన స్థలాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. కాగజ్ నగర్ మండలం వంజిరి గ్రామానికి చెందిన డోంగ్రి అనసూయ, ప్రజ్ఞశీల్, చంద్రీ జగన్ మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా వేగంగా కారులో వచ్చి వెనుక నుండి బైక్ మీద ప్రయాణిస్తున్న వంజీరి గ్రామస్తులను గుద్దడంతో ముగ్గురు మరణించారని, చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించండం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు. వారిని అన్ని విధాల ఆదుకోవడానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే వంట స్థానిక నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
Admin
E Nivas News