ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట పట్టణంలోని ఆంధ్ర బోర్ కు చెందిన బైక్ మెకానిక్ ఎర్రోజుల సత్యనారాయణ (50) బాత్రూంలో కాలుజారిపడి మృతి చెందాడు. మృతుడు గత నెల 30న ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళగా బాత్రూంలో బీపీ ఎక్కువ అయి కాలుజారి బాత్రూంలో పడిపోగా కుటుంబ సభ్యులు గమనించి లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యుల పరీక్షించి తలలో రక్తం గడ్డ కట్టిందని తెలుపగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ రిఫర్ చేయగా కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రతిమ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని తమ్ముడు ఎర్రోజుల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Admin
E Nivas News