ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలంలో జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని మంథని ఎస్సై తెలిపారు. మధ్యాహ్నం కౌంటింగ్ ప్రక్రియలో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు, వారికి సంబంధించిన వారు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించిన వారిపై చట్ట రీత్యా కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. అనంతరం సంబంధిత అధికారుల వద్ద అనుమతులు తీసుకొని ర్యాలీలు నిర్వహించవచ్చని తెలిపారు.
Admin
E Nivas News