ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు వ్యాపారుల చేతుల్లో నిలువు దోపిడీకి గురి అవుతున్నారు. పత్తి సీజన్లో అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి రాక రైతులు నష్టపోయిన విషయం అధికారులకు తెలిసిందే. కానీ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోకుండా, అధిక తేమ శాతం పేరుతో పత్తి కొనుగోలు చేయక పోవడం తో, రైతులకు గిట్టుబాటు ధర రాక మరింత నష్ట పోతున్నారు. ఇదే అదును చూసి ప్రైవేట్ వ్యాపారస్తులు తక్కువ ధర కు పత్తి తీసుకుంటు నిలువు దోపిడీ చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు గాని, తునికలా శాఖ అధికారులు గాని ప్రైవేట్ వ్యాపారస్తుల వైపు చూడడం లేదు. అసలు తూకం వేసే కాంటాలు తనిఖీ చెస్తూన్నారో, లేదో తెలియడం లేదని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంటాల రూపంలో దోపిడీ జరుగు తున్న,విచ్చలవిడిగా కాంటాలు పెట్టి పత్తి కొనుగోలు చేస్తున్న తునికలా శాఖ అధికారులు పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు అధిక వర్షాలు,, ఇంకోవైపు నిలువుదోపిడి, మరొక వైపు తనిఖీ లేని దోపిడీ చేయడంతో రైతులు నష్ట పోతున్న ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చి రైతులకు మరింత ఇబ్బంది గా మారింది, స్లాట్ బుక్ చేసుకొని పోతే అధిక తేమ ఉందని రిజెక్ట్ చేస్తున్నారని వాపోతున్నారు.ఈ యాప్ లో తేమ శాతం పెట్టి ఉండాల్సింది, ఇది కూడా ఒక రకమైన దోపిడీ అంటున్నారు. కనీసం ఈ ఏడాది పత్తి ధర రూ 12000 చేయాలనీ డిమాండ్ చేస్తూ,దోపిడీకి గురి చేస్తున్న ప్రైవేట్ వ్యాపారుల నుండి రైతులను కాపాడాలని అలాగే ఎలాంటి షరతులు లేకుండా, తేమశాతం చూడకుండా ఎకరానికి ఏడు క్వింటల్ అనే నిబంధన తీసివేసి పత్తి కొనుగోలు చేయాలనీ రైతులు డిమాండ్ చేస్తున్నారు. పత్తి మిల్లుల వద్ద రోజుల తరబడి వ్యాన్లలో, ట్రాక్టర్లలో, ఎడ్లబండ్లలో పత్తిని తీసుకువచ్చిన అధికారులు గాని ఎటువైపు చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆధునిక భావించిన వ్యాపారులు తమ వద్దకు వచ్చి పత్తి కొనుగోలు చేస్తామని నెట్ డబ్బులు ఇస్తామని అనడంతో చేసేదిలేక కొందరు రైతులు అమ్ముతున్నారని తెలిపారు. అలాగే రోజుకు వ్యాన్లకు ట్రాక్టర్లకు కిరాయి కట్టే ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో పత్తి విక్రయించగా వచ్చిన డబ్బులన్నీ కిరాయిలకే సరిపోతాయన్న ఉద్దేశంతో దళారులకు7,8 వేల రూపాయ అమ్మడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ అధికారుల పని తీరుపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో పత్తి రైతులు కోరుతున్నారు.
Admin
E Nivas News