Tuesday, 28 July 2026 07:00:38 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

పత్తి కొనుగోలులో ప్రైవేట్ వ్యాపారుల దోపిడి...

పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

Date : 10 November 2025 08:16 PM Views : 271

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు వ్యాపారుల చేతుల్లో నిలువు దోపిడీకి గురి అవుతున్నారు. పత్తి సీజన్లో అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి రాక రైతులు నష్టపోయిన విషయం అధికారులకు తెలిసిందే. కానీ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోకుండా, అధిక తేమ శాతం పేరుతో పత్తి కొనుగోలు చేయక పోవడం తో, రైతులకు గిట్టుబాటు ధర రాక మరింత నష్ట పోతున్నారు. ఇదే అదును చూసి ప్రైవేట్ వ్యాపారస్తులు తక్కువ ధర కు పత్తి తీసుకుంటు నిలువు దోపిడీ చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు గాని, తునికలా శాఖ అధికారులు గాని ప్రైవేట్ వ్యాపారస్తుల వైపు చూడడం లేదు. అసలు తూకం వేసే కాంటాలు తనిఖీ చెస్తూన్నారో, లేదో తెలియడం లేదని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంటాల రూపంలో దోపిడీ జరుగు తున్న,విచ్చలవిడిగా కాంటాలు పెట్టి పత్తి కొనుగోలు చేస్తున్న తునికలా శాఖ అధికారులు పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు అధిక వర్షాలు,, ఇంకోవైపు నిలువుదోపిడి, మరొక వైపు తనిఖీ లేని దోపిడీ చేయడంతో రైతులు నష్ట పోతున్న ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చి రైతులకు మరింత ఇబ్బంది గా మారింది, స్లాట్ బుక్ చేసుకొని పోతే అధిక తేమ ఉందని రిజెక్ట్ చేస్తున్నారని వాపోతున్నారు.ఈ యాప్ లో తేమ శాతం పెట్టి ఉండాల్సింది, ఇది కూడా ఒక రకమైన దోపిడీ అంటున్నారు. కనీసం ఈ ఏడాది పత్తి ధర రూ 12000 చేయాలనీ డిమాండ్ చేస్తూ,దోపిడీకి గురి చేస్తున్న ప్రైవేట్ వ్యాపారుల నుండి రైతులను కాపాడాలని అలాగే ఎలాంటి షరతులు లేకుండా, తేమశాతం చూడకుండా ఎకరానికి ఏడు క్వింటల్ అనే నిబంధన తీసివేసి పత్తి కొనుగోలు చేయాలనీ రైతులు డిమాండ్ చేస్తున్నారు. పత్తి మిల్లుల వద్ద రోజుల తరబడి వ్యాన్లలో, ట్రాక్టర్లలో, ఎడ్లబండ్లలో పత్తిని తీసుకువచ్చిన అధికారులు గాని ఎటువైపు చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆధునిక భావించిన వ్యాపారులు తమ వద్దకు వచ్చి పత్తి కొనుగోలు చేస్తామని నెట్ డబ్బులు ఇస్తామని అనడంతో చేసేదిలేక కొందరు రైతులు అమ్ముతున్నారని తెలిపారు. అలాగే రోజుకు వ్యాన్లకు ట్రాక్టర్లకు కిరాయి కట్టే ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో పత్తి విక్రయించగా వచ్చిన డబ్బులన్నీ కిరాయిలకే సరిపోతాయన్న ఉద్దేశంతో దళారులకు7,8 వేల రూపాయ అమ్మడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ అధికారుల పని తీరుపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో పత్తి రైతులు కోరుతున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: