Tuesday, 28 July 2026 11:42:10 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మానసిక ఆరోగ్యం పై విద్యార్థులకు అవగాహన

Date : 16 October 2025 08:04 PM Views : 326

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో డిస్టిక్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వైద్యుడు లింగ రెడ్డి ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యం పై గురువారంఅవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా మానసిక వైద్యాన్నిపుణుడు సునీల్ కుమార్ పిల్లల మానసిక సమస్యలపై అవగాహన కల్పించారు. పరీక్షల ఒత్తిడిని ఎలా నివారించుకోవాలో తెలిపారు . అలాగే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలా సన్నద్ధం కావాలో చక్కగా వివరించారు. అంతేకాదు ఏవైనా మానసికంగా బాధలు అనిపిస్తే కచ్చితంగా పక్కవారితో పంచుకోవాలని ఈ విధంగా చేస్తే చాలావరకు సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. చెప్పుకోలేని సమస్య ఎదురైనప్పుడు, మొహమాట పడకుండా 14416 టోల్ ఫ్రీ నెంబరికి కాల్ చేసి సమస్య వివరించాలని తప్పకుండా మానసిక సమస్య తీరుతుందని చెప్పారు. తర్వాత ఆరోగ్య వైద్యాధికారి సతీష్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు చేయవలసిన అత్యవసర ప్రాథమిక చికిత్స అయినటువంటి సి పి ఆర్ గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులతో కూడా ప్రాక్టీస్ చేయించారు. జిల్లా అధికారి లింగారెడ్డి ధూమపానం మనుషుల ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో వివరించారు. తర్వాత విద్యార్థులు తమకున్న సందేహాలను నివృత్తి పరుచుకున్నారు. తమ అభిప్రాయాలను వివరించారు. అనంతరం ప్రిన్సిపల్ రమా కళ్యాణి మాట్లాడుతూ పిల్లలకు తెలియనటువంటి చక్కటి విషయాలను వివరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమా కళ్యాణి , వైస్ ప్రిన్సిపాల్ గీతాంజలి , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ శిరీష, హెల్త్ సూపర్వైజర్ పల్లవి, అలాగే మెంటల్ వెల్ బీయింగ్ ట్రైనర్స్ గీతాంజలి, సుజాత ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: