ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో భార్య మరణం తట్టుకోలేక గంటల వ్యవధిలోని భర్త మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దహేగాం మండలం కమ్మర్పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్ 32 కు బెల్లంపల్లి మండలం గురజాల కు చెందిన సువర్ణ తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. వినోద్ కేబుల్ టీవీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. సువర్ణ గత ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతోంది గురువారం రాత్రి 8 గంటలకు సువర్ణ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మరణించింది శుక్రవారం అంతక్రియలు పూర్తి చేసిన తర్వాత ఇంటికి వచ్చిన వినోద్ ఉన్నట్టుండి ఒకసారిగా కింద పడిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దహేగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వినోద్ అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. దీంతో గంటల సమయంలో భార్యా భర్తలు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బంధువుల రోదనతో గ్రామం విషాదవదనంగా మారింది.
Admin
E Nivas News