ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : క్రీడలు స్నేహపూరిత వాతావరణంలో ఆడుకోవాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలంలోని వడూర్ గ్రామంలో నిర్వహించిన వడూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టౌర్నమెంటులో విజేతలుగా నిలిచిన వడూర్ రైడర్స్ మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి బ్లాక్ బాస్టర్స్ 10,000లతో పాటు ట్రోఫీలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఎండల పట్ల జాగ్రత్తలు పాటిస్తూ క్రీడలు ఆడాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని గెలిస్తే పొంగిపోవద్దు, ఓడితే కృంగిపోవద్దు అని అన్నారు.కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ పండరీ, సుజీల్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News