ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 15న సత్యనారాయణ స్వామి గూడెం లిఫ్ట్ నుండి నీళ్లను విడుదల చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమాచారం ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు సోమవారం విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో తెలిపారు. గత సంవత్సరంజనవరి 5కు విడుదల చేయడం జరిగిందని ఇప్పుడు చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల నీళ్ల కు రైతులకు ఇబ్బంది జరిగిందని తెలిపారు. వాటి మరమ్మతులు జరుగుతున్నాయని వెంటనే వేసవి పంటకు నీళ్లు ఇవ్వడం జరుగుతుం దన్నారు. 4లిప్ట్ లు కొత్తగా తెచ్చిన చరిత్ర ప్రేమ్ సాగర్ రావు కే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చల్ల నాగభూషణం, ఆరిఫ్, ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, దాసరి ప్రేమ్చంద్, గడ్డం త్రిమూర్తి, పింగళి రమేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News