ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈవీడియో కాన్ఫరెన్స్ కు ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 60 శాతం జరిగి నట్లు తెలిపారు. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపా రు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి ఇంటి నుండి ఖచ్చితమైన వివరాలు సేకరిస్తామని అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ శాతాన్ని పెంచేందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేసేలా ఆదేశాలు ఇస్తామని తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను నిర్ధారించి, శాతం పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్లును వెంటనే నియమించుకునేలా చర్యలు తీసు కుంటామని అన్నారు. మ్యాపింగ్ సమయంలో త ప్పు ఎంట్రీలు, తప్పు లింకింగ్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్ల సౌలభ్యం కొరకు బుక్ ఎ కాల్ విస్తృతప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఓట రు పేరు సరైన పోలింగ్ స్టేషన్కు మ్యాప్ కావడం ప్రజాస్వామ్యానికి కీలక మని అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ పడాల అశోక్ కుమార్, ఎన్నికల వి భాగం పర్యవీక్షకులు అ బ్బాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News