ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : గోదావరిఖని బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది గుల్ల రమేష్ పై జరిగిన దాడికి నిరసనగా సోమవారం లక్షెట్టిపేట న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు న్యాయవాదులపై దినదినం పెరుగుతున్న దాడులను ఖండిస్తూ న్యాయవాద రక్షణచట్టం కొరకు డిమాండ్ చేస్తున్నట్టు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో సంఘటనలు జరిగిన పట్టించుకోవడం సోషల్యంగా ఉందని పలువురు న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎట్టి దాడులను ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, ఉపాధ్యక్షుడు నళినికాంత్, జాయింట్ సెక్రటరీ సత్యగౌడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రెడ్డిమల్ల ప్రకాశం,సదాశివ సీనియర్ న్యాయవాదులు కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, గోవిందరావు,గడికొప్పుల కిరణ్ కుమార్, నగరు రవీందర్, షఫీక్,పద్మ తాజోద్దీన్,ఆనందబాబు గణేష్,రుమాన్ షెఫీక్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News