Wednesday, 29 July 2026 12:07:55 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ధన్నూర్, కుప్టి, కుచులపూర్ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు..! 6న భూమిపూజ

Date : 01 April 2026 10:40 PM Views : 235

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పార్టీలో ఏవైనా, ప్రజల పక్షాన, ప్రజా అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడి బోథ్ నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామంలో మంజూరు అయిన విద్యుత్ సబ్ స్టేషన్ స్థలాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. బోథ్ మండలంలోని ధన్నుర్ బి గ్రామంలో, నెరడిగొండ మండలంలోని కుప్టి గ్రామంలో, తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్లు కావాలని పలు మార్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంత్రులను, అధికారులను కలిసి విన్నవించారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉట్నూర్ మండలంలోని పెర్కాగుడా గ్రామానికి విచ్చేసినప్పుడు సైతం వినతిపత్రం అందజేయగా ఎట్టకేలకు బోథ్ నియోజకవర్గంలోని బోథ్ మండలంలో ధన్నుర్ బి, నెరడిగొండ మండలంలోని కుప్టి కుమారి, తలమడుగు మండలంలోని కుచులపూర్ లో నూతనంగా 3 విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తానని, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన ప్రజా సమస్యలకై అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి వైపే వెళ్తానని తెలిపారు. ఇట్టి సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఈనెల 6వ తేదీన బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :