Sunday, 13 September 2026 12:52:25 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

విద్యాసంస్థల బంద్ కు (డి.వై.ఎఫ్.ఐ) సంపూర్ణ మద్దత్తు

Date : 09 July 2026 11:50 PM Views : 82

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో ఉన్న వివిధ విద్యారంగ సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్ కు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) కుమురం భీమ్ ఆసిఫాబాద్ కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించాలనే ఆలోచనను బేషరుగా మానుకోవాలని అన్నారు. అదేవిధంగా విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలని, ముఖ్యమంత్రి ఒక్కడే వివిధ శాఖలను నిర్వహించడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారని. తద్వారా విద్యావ్యవస్థ నాశనం అవుతోంది అన్నారు.అలాగే పాఠశాలలు ప్రారంభం అయినా కూడా ఇంకా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందించలేదని, అవి తొందరగాఅందించాలని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి, అక్షయ పాత్ర, ఇస్కాన్, మన్నా సంస్థలకు కాకుండా మహిళా సంఘాలకు అప్పగించాలన్నారు. ప్రస్తుత దోపిడీ ప్రభుత్వాల వలన సామాన్యుడు బ్రతికి బట్టకట్టే పరిస్థితే లేనప్పుడు ప్రైవేట్, కార్పోరేట్ విద్య సంస్థలు విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు. దీనిని అరికట్టి, ఫీజు నియంత్రణ చట్టం చేయాలనిసూచించారు. అలాగే ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ,డిఈఓ మరియు లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలని తద్వారా స్థానిక విద్య సంస్థల విద్య పురోగతి సాధిస్తుందని.అలాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేసి జి.ఓ నెం: 7,8,9 లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలకు మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే ప్రారంభించి, నిధులు కేటాయించాలన్నారు.అద్దె భవనాలలో నడుస్తున్న పాఠశాలలు, హాస్టల్స్, గురుకులాలకు సొంతభవనాలునిర్మించాలని, ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్స్సు ఏర్పాటు చేసి అధునాతన భవనాలను నిర్మించాలని. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి,ప్రభుత్వ బడి బస్సులు నడపాలని ప్రతీ విద్యార్థికి ఉచిత బస్ పాస్లు ఇవ్వాలని. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ప్రతి పాఠశాలకు కరెంట్, ఇంటర్నెట్, త్రాగునీరు, వంటషెడ్లు,మరుగుదొడ్లు సౌకర్యాన్ని కల్పించాలని, విద్యాసంస్థలలో ర్యాగింగ్ నిరోధక, డ్రగ్స్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి. ఐసీసీ కమిటీలు నియమించాలని, విద్యాహక్కు చట్టం అమలు చేసి, పేద విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించాలని,రాష్ర్టంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, కాంగ్రెస్ విద్యారంగానికి ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసి, 5 లక్షల విద్యా భరోసా కార్డులు, ఉచిత లాప్ ట్యాప్లు అందించాలని,ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలలో విచ్చలవిడిగా పుస్తకాలు, యూనిఫామ్, నోట్బుక్ విక్రయ కేంద్రాలను మూసివేయాలని, నెప్ 2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మాణం చేయాలని తదితర డిమాండ్స్ చేశారు.ఈ కార్యక్రమంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం రాజ్ కుమార్, డి.వై. ఎఫ్.ఐ జిల్లా నాయకుడు రత్నాకర్, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) మండల నాయకులు వినోద్, సుమిత్, ధనుంజయ్, మహేష్, సాగర్తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :