Thursday, 30 July 2026 11:18:43 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు...

ఆందోళన చెందుతున్న ప్రజలు

Date : 29 July 2026 09:04 PM Views : 20

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉండటంతో వరి ఉత్పత్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బియ్యం ధరలకు రెక్కలు రావడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు బియ్యం నిల్వలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొన్ని వారాలుగా బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణ బియ్యంతో పాటు సన్నబియ్యం, ప్రీమియం రకాల ధరలుకూడాపెరగడంతో వినియోగదారులపై అదనపు పడిందంటున్నారు. 26 కిలోల బస్తా ధరలో రూ.100 నుంచి రూ.300 వరకు పెరుగుదల నమోదైనట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. రిటైల్ మార్కెట్‌లో కిలోకు రూ.3 నుంచి రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.ఎగుమతుల పెరుగుదల, ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు మరో కారణంగావ్యాపారులు చెబుతున్నారు.వ్యాపారులుకృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే ప్రయత్నాలుజరగకుండా అధికారులు బియ్యం మార్కెట్లపై నిఘా పెంచారు. నిల్వలు, సరఫరాపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనతో వినియోగదారులు ముందుగానే బియ్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో డిమాండ్ మరింత పెరుగుతోంది. ఏది ఏమైనా ప్రభావంతో సామాన్యుడికి నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేయడానికి కష్టతరంగానే మారుతున్నాయి అనడంలో సందేహం లేదని అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: