ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గజ్వేల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గజ్వేల్ లోని మల్లన్న సాగర్ నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ లోని 8, 9,10,11,12,19 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి గజ్వేల్ పట్టణంలో బైక్ ర్యాలీ తో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పూర్తిస్థాయి నిధులు రావాలన్నా రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సిద్దిపేట డిసిసి అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి,మాజీ డిసిసిబి చైర్మన్ దేవేందర్ రెడ్డి, బండి రమేష్ గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News