Saturday, 13 June 2026 02:24:13 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

స‌జావుగా ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌ల నిర్వహణ..! అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పూర్తి ఏర్పాట్లు

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 10 February 2026 09:14 AM Views : 184

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ).. నాలుగు నోటిఫికేష‌న్ల‌కు సంబంధించి నిర్వహిస్తున్న ప‌రీక్ష‌లు స‌జావుగా జ‌రుగుతున్నాయ‌ని, అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ తెలిపారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. న‌గ‌రంలోని సీవీఆర్ బాలిక‌ల న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉన్న‌త పాఠ‌శాల ప‌రీక్షా కేంద్రాన్ని సంద‌ర్శించారు. అభ్య‌ర్థులు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప‌రీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ అట‌వీ, ఎండోమెంట్ శాఖ‌ల‌కు సంబంధించి వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంద‌ని, ఇవి ఈ నెల 13వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతాయ‌న్నారు. విజ‌య‌వాడ‌, ప‌రిస‌ర ప్రాంతాల్లోని 15 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని.. సీటింగ్ అరేంజ్‌మెంట్‌, ఫ‌ర్నిచ‌ర్‌, తాగునీరు, మ‌రుగుదొడ్లు, విద్యుత్ స‌ర‌ఫ‌రా ఇలా వివిధ అంశాల్లో ఎక్క‌డా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామ‌న్నారు. లైజ‌నింగ్‌, చీఫ్ సూప‌రింటెండెంట్లతో పాటు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు స‌మ‌ష్టి కృషితో ప‌రీక్ష‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఆదేశాలిచ్చామ‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు దిశానిర్దేశం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, పూర్తి భద్రత మ‌ధ్య పరీక్షలు రాసేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :