ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బలుగుబడకి బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలను శుక్రవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపాటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బలహీన వర్గాల మగ ఆడ పిల్లలంతా చదువుకోవాలని ఉద్దేశంతో తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి ముందడుగు వేశారు. ఎన్ని అవమానాలు ఎదురైన వాటిని పట్టించుకోకుండా తాము సాధించాలన్న ధ్యేయంతో బాలురతోపాటు బాలికలకు కూడా విద్యాసంస్థలు ఏర్పాటు చేసి చదువు నేర్పించిన మహనీయులన్నారు. వారి కారణంగానే ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని గుర్తు చేశారు. ఆయన సేవలు గుర్తించిన ప్రభుత్వం ఆయన పేరుతో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాలు కూడా ఏర్పాటుచేసి పేద విద్యార్థుల అభ్యున్నతికి దోహదం చేస్తున్నాయన్నారు. ఈ ప్రతి ఒక్కరికి చదువు రావాలన్న సంకల్పమే వారి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన చూపిన బాటలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమాలలో నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News